నిదానపల్లిలో నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
నిదానపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ గుత్త నరసింహారెడ్డి హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండాలని ఆయన సూచించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా సమిష్టిగా పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. నూతన పాలకవర్గానికి భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని, వారి పాలనలో గ్రామం మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగగా, గ్రామ ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గాన్ని అభినందించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి