నాగార్జున పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
నాగార్జున పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
నాగార్జున పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారులతో విద్యాభ్యాసాన్ని ప్రారంభింపజేశారు.
వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవి పూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ నాగరాజు నకిరేకంటి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి విద్యాభ్యాసాన్ని ప్రారంభింపజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరస్వతి దేవి జన్మదినం రోజున తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమేనని ఆయన అన్నారు. విద్యతోనే పిల్లల భవిష్యత్తు వెలుగొందుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రేఖ.ఎన్తో పాటు పాఠశాల సిబ్బంది సంధ్య, అక్రమ్, స్వప్న, విజయ్ శ్రీలత, వినిష పాల్గొన్నారు. పలువురు తల్లిదండ్రులు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి