Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:19 PM

నాగార్జున పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నాగార్జున పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నాగార్జున పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
January 26, 2026 03:45 PM 208 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రాజ్యాంగ విలువలపై ఓయూ అధ్యాపకుల పిలుపు

స్థానికం ప్రధాన ప్రతినిధి

నాగార్జున పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డబ్ల్యు. మాయాదేవి, హిందీ విభాగ అధ్యయన మండలి సభ్యురాలు డాక్టర్ కె. సంగీత వ్యాస్ ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులు, విధులపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని సమాజానికి ఆదర్శంగా నిలిచే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. తల్లిదండ్రులకు, గురువులకు గౌరవం తీసుకొచ్చే విధంగా జీవితాన్ని మలచుకోవాలని పిలుపునిచ్చారు.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన వ్యాస రచన, క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మహనీయుల జీవిత చరిత్రలతో కూడిన పుస్తకాలను బహుమతులుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధి డాక్టర్ నాగరాజు, ప్రధానోపాధ్యాయురాలు నకిరేకంటి రేఖ, ఉపాధ్యాయులు అక్రం, సంధ్య, స్వప్న, విజయశ్రీ, లత, వినీషా, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News