Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 10:33 AM

నాగార్జున పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నాగార్జున పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నాగార్జున పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
January 26, 2026 03:45 PM 232 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రాజ్యాంగ విలువలపై ఓయూ అధ్యాపకుల పిలుపు

స్థానికం ప్రధాన ప్రతినిధి

నాగార్జున పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డబ్ల్యు. మాయాదేవి, హిందీ విభాగ అధ్యయన మండలి సభ్యురాలు డాక్టర్ కె. సంగీత వ్యాస్ ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులు, విధులపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని సమాజానికి ఆదర్శంగా నిలిచే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. తల్లిదండ్రులకు, గురువులకు గౌరవం తీసుకొచ్చే విధంగా జీవితాన్ని మలచుకోవాలని పిలుపునిచ్చారు.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన వ్యాస రచన, క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మహనీయుల జీవిత చరిత్రలతో కూడిన పుస్తకాలను బహుమతులుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధి డాక్టర్ నాగరాజు, ప్రధానోపాధ్యాయురాలు నకిరేకంటి రేఖ, ఉపాధ్యాయులు అక్రం, సంధ్య, స్వప్న, విజయశ్రీ, లత, వినీషా, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News