Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:12 AM

నార్కెట్‌పల్లిలో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్లు, సర్పంచ్ పాలకవర్గానికి సన్మానం

నార్కెట్‌పల్లిలో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్లు, సర్పంచ్ పాలకవర్గానికి సన్మానం

నార్కెట్‌పల్లిలో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్లు, సర్పంచ్ పాలకవర్గానికి సన్మానం
08-01-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ చేతన హై స్కూల్‌లో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఇటీవల ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని మాట్లాడారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమని అన్నారు. వారి కష్టాన్ని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. ప్రజల విశ్వాసంతో ఎన్నికైన సర్పంచ్ పాలకవర్గ సభ్యులు గ్రామాభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.సమాజ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పారిశుధ్య కార్మికులు, విద్యాసంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నార్కెట్‌పల్లిలో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్లు, సర్పంచ్ పాలకవర్గానికి సన్మానం

Article Image
నకిరేకల్ స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ చేతన హై స్కూల్‌లో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఇటీవల ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని మాట్లాడారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమని అన్నారు. వారి కష్టాన్ని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. ప్రజల విశ్వాసంతో ఎన్నికైన సర్పంచ్ పాలకవర్గ సభ్యులు గ్రామాభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.సమాజ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పారిశుధ్య కార్మికులు, విద్యాసంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News