నార్కెట్పల్లిలో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్లు, సర్పంచ్ పాలకవర్గానికి సన్మానం
నార్కెట్పల్లిలో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్లు, సర్పంచ్ పాలకవర్గానికి సన్మానం
Editor Desk
నకిరేకల్ స్థానికం ప్రధాన ప్రతినిధి
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కెట్పల్లి మండల కేంద్రంలోని శ్రీ చేతన హై స్కూల్లో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఇటీవల ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని మాట్లాడారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమని అన్నారు. వారి కష్టాన్ని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. ప్రజల విశ్వాసంతో ఎన్నికైన సర్పంచ్ పాలకవర్గ సభ్యులు గ్రామాభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.సమాజ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పారిశుధ్య కార్మికులు, విద్యాసంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి