Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:44 PM

ముస్లిం సమాజానికి కమ్యూనిటీ హాల్ కోరుతూ వినతిపత్రం

ముస్లిం సమాజానికి కమ్యూనిటీ హాల్ కోరుతూ వినతిపత్రం

 ముస్లిం సమాజానికి కమ్యూనిటీ హాల్ కోరుతూ వినతిపత్రం
January 11, 2026 04:12 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
వనస్థలిపురం స్థానికం ప్రధాన ప్రతినిధి

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీనివాసపురం కాలనీలో మస్జిద్-ఎ-మొహియుద్దీన్ కమిటీ ఆధ్వర్యంలో శాలువా సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ క్యాంపింగ్ కమిటీ చైర్మన్, ఎల్.బి.నగర్ ఇన్‌చార్జ్ మధు యాష్కీ గౌడ్, వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై సత్కారం స్వీకరించారు.

ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వనస్థలిపురం డివిజన్‌లో ముస్లిం సమాజానికి ఇప్పటివరకు ప్రత్యేక కమ్యూనిటీ హాల్ లేకపోవడం వల్ల వివాహాలు, సామాజిక సమావేశాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సమాజ అవసరాలను వివరించి, తక్షణమే కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కోరుతూ అతిథులకు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో మస్జిద్-ఎ-మొహియుద్దీన్ అధ్యక్షుడు ఆసిఫ్ పయనీర్, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాషం అశోక్ గౌడ్, క్రిస్టియన్ కాలనీ అధ్యక్షుడు హరిందర్ రెడ్డి, మల్లికార్జున్ నగర్ కాలనీ అధ్యక్షుడు నర్సి రెడ్డి, అభ్యుదయ నగర్ కాలనీ అధ్యక్షుడు గంగి రెడ్డి, జంగీర్ నగర్ కాలనీ అధ్యక్షుడు యూసఫ్, బాల్ రెడ్డి, సలీం, హస్తినాపురం ఈస్ట్ అధ్యక్షుడు భూపతి రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామారావు, గుంటి జంగయ్య నగర్ కాలనీ మహిళా మండలి అధ్యక్షురాలు భాను తదితరులు పాల్గొన్నారు. మస్జిద్ కమిటీ సభ్యులు, వివిధ కాలనీల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News