ముస్లిం సమాజానికి కమ్యూనిటీ హాల్ కోరుతూ వినతిపత్రం
ముస్లిం సమాజానికి కమ్యూనిటీ హాల్ కోరుతూ వినతిపత్రం
Editor Desk
వనస్థలిపురం స్థానికం ప్రధాన ప్రతినిధి
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీనివాసపురం కాలనీలో మస్జిద్-ఎ-మొహియుద్దీన్ కమిటీ ఆధ్వర్యంలో శాలువా సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ క్యాంపింగ్ కమిటీ చైర్మన్, ఎల్.బి.నగర్ ఇన్చార్జ్ మధు యాష్కీ గౌడ్, వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై సత్కారం స్వీకరించారు.
ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వనస్థలిపురం డివిజన్లో ముస్లిం సమాజానికి ఇప్పటివరకు ప్రత్యేక కమ్యూనిటీ హాల్ లేకపోవడం వల్ల వివాహాలు, సామాజిక సమావేశాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సమాజ అవసరాలను వివరించి, తక్షణమే కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కోరుతూ అతిథులకు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో మస్జిద్-ఎ-మొహియుద్దీన్ అధ్యక్షుడు ఆసిఫ్ పయనీర్, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాషం అశోక్ గౌడ్, క్రిస్టియన్ కాలనీ అధ్యక్షుడు హరిందర్ రెడ్డి, మల్లికార్జున్ నగర్ కాలనీ అధ్యక్షుడు నర్సి రెడ్డి, అభ్యుదయ నగర్ కాలనీ అధ్యక్షుడు గంగి రెడ్డి, జంగీర్ నగర్ కాలనీ అధ్యక్షుడు యూసఫ్, బాల్ రెడ్డి, సలీం, హస్తినాపురం ఈస్ట్ అధ్యక్షుడు భూపతి రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామారావు, గుంటి జంగయ్య నగర్ కాలనీ మహిళా మండలి అధ్యక్షురాలు భాను తదితరులు పాల్గొన్నారు. మస్జిద్ కమిటీ సభ్యులు, వివిధ కాలనీల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి