మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు – జిల్లా కలెక్టర్ హనుమంతరావు
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు – జిల్లా కలెక్టర్ హనుమంతరావు
Editor Desk
రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా ప్రక్రియ పూర్తి
యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి
రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరిస్తూ జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు చెందిన వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.
శనివారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ ఖరారు ప్రక్రియను కలెక్టర్ పారదర్శకంగా నిర్వహించారు. నిబంధనల ప్రకారం లాటరీ విధానంలో రిజర్వేషన్ల కేటాయింపు జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో
భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులు,
ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులు,
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులు,
చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులు,
పోచంపల్లి మున్సిపాలిటీలో 13 వార్డులు,
మోత్కూర్ మున్సిపాలిటీలో 12 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిపారు.
మున్సిపాలిటీ వార్డులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన రిజర్వేషన్ నిబంధనల ప్రకారం, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా కేటాయింపులు చేపట్టామని కలెక్టర్ హనుమంతరావు వివరించారు. ఈ ప్రక్రియ పూర్తిగా న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్డీవోలు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి