Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:52 AM

మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు – జిల్లా కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు – జిల్లా కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు – జిల్లా కలెక్టర్ హనుమంతరావు
January 17, 2026 06:04 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా ప్రక్రియ పూర్తి

యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరిస్తూ జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు చెందిన వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.

శనివారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్‌లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ ఖరారు ప్రక్రియను కలెక్టర్ పారదర్శకంగా నిర్వహించారు. నిబంధనల ప్రకారం లాటరీ విధానంలో రిజర్వేషన్ల కేటాయింపు జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో

భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులు,

ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులు,

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులు,

చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులు,

పోచంపల్లి మున్సిపాలిటీలో 13 వార్డులు,

మోత్కూర్ మున్సిపాలిటీలో 12 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిపారు.

మున్సిపాలిటీ వార్డులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన రిజర్వేషన్ నిబంధనల ప్రకారం, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా కేటాయింపులు చేపట్టామని కలెక్టర్ హనుమంతరావు వివరించారు. ఈ ప్రక్రియ పూర్తిగా న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్డీవోలు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News