Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:30 AM

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి.
January 17, 2026 04:39 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి.

కలిసివచ్చే లౌకిక శక్తులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం....

సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానిక ప్రతినిధి బిక్షం

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గం సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిపిఎం అభ్యర్థులు గెలిస్తే ప్రజా సమస్యలపై మున్సిపల్ కౌన్సిల్ లో పోరాటం చేస్తారని, వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పాలకవర్గంపై ఒత్తిడి తీసుకువచ్చి వార్డుల అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. ఎలాంటి అవినీతి లేకుండా సుపరిపాలన కమ్యూనిస్టులు అందిస్తారని అన్నారు. గతంలో సిపిఎం తరపున ఎన్నికైన కౌన్సిలర్ లు నీతిగా, నిజాయితీగా పాలన కొనసాగించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కలిసివచ్చే లౌకిక పార్టీలను కలుపుకొని 5 మున్సిపాలిటీలలో పోటీ చేస్తామన్నారు. పార్టీ కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు, మట్టి పెళ్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News