Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:06 PM

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి – ఎమ్మార్వోకు వినతిపత్రం

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి – ఎమ్మార్వోకు వినతిపత్రం

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి – ఎమ్మార్వోకు వినతిపత్రం
January 16, 2026 05:12 PM 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మున్సిపల్ ఎన్నికలను బీసీలకు చట్టబద్ధమైన 42 శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చిట్యాల ఎమ్మార్వో విజయ మేడం కి బీసీ సంఘాల నాయకులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం మాట్లాడుతూ—ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేసి మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని కోరారు.బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ రంగాల్లోనే కాకుండా స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ శాశ్వత రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ అవసరమని వారు పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీసీల ప్రాతినిధ్యం ఇప్పటికీ 14 శాతం దాటకపోవడం వారి రాజకీయ వెనుకబాటుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D(6) ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని తెలిపారు. ఈ అధికారం ఆధారంగా అసెంబ్లీలో ఇప్పటికే చట్టం చేసిన నేపథ్యంలో వెంటనే జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.సుప్రీంకోర్టు అగ్రకులాలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన సందర్భంగా 50 శాతం సీలింగ్‌ను సడలించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇందిరా సహానీ కేసులో కూడా ఎంపిరికల్ డేటా ఉంటే 50 శాతం పరిమితిని అధిగమించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. కులాల వారీ జనాభా లెక్కలు, అసెంబ్లీ చట్టం ఉన్న నేపథ్యంలో ఈ కేసు న్యాయపరంగా, రాజ్యాంగపరంగా పూర్తిగా బలంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు.కావున ఎలాంటి రాజ్యాంగ, న్యాయపరమైన అడ్డంకులు లేకపోవడంతో బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించి మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, మనీల్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News