మునిపంపులలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి
మునిపంపులలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి
Editor Desk
నల్లగొండ జిల్లా:
భారతీయ జనతా పార్టీ మునిపంపుల గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గ్రామ శాఖ అధ్యక్షుడు తెల్కలపల్లి గిరి నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు యాదాసు లక్ష్మణ్ కుమార్ (రెండో వార్డు) మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలు యువతకు శాశ్వత మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన బోధనల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతే దేశానికి వెన్నుముక అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరచూ పేర్కొంటారని, యువత అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం యువ వికాస్ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తినిస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డోగిపర్తి భాస్కర్, ఏలూరు రవి, చోల్లేటి చంద్రశేఖరాచారి, బూడిద కిరణ్, సురేపల్లి వీరేందర్, పున్న శ్రీకాంత్, బుడద చింటూ, బేతు ధర్మేందర్, గాదె శ్రీకాంత్, సూరపల్లి నరేష్, మామిండ్ల రామ్ నాగేందర్, కూరెల్ల రామకృష్ణాచారి, మధు, కానుకుంట్ల నరేష్, మారయ్య, ప్రశాంత్, మిరియాల వెంకటేష్, ఏలూరి నిహారిక తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి