Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:54 AM

మున్సిపాలిటీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు

మున్సిపాలిటీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు

మున్సిపాలిటీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు
January 19, 2026 05:56 PM 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి:

పోచంపల్లి మున్సిపాలిటీలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సోమవారం పోచంపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీలో మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయో, వార్డుల వారీగా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు పూర్తిగా ఉన్నాయా లేదా అన్నది క్షుణ్నంగా పరిశీలించాలని సూచించారు.ఎన్నికల నిర్వహణకు నియమించబడిన అధికారులు, సిబ్బంది అందరూ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల విధులను అత్యంత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.మున్సిపాలిటీ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ పూర్తయ్యిందా లేదా అన్న అంశాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలా పకడ్బందీగా నిర్వహించారో అదే స్థాయిలో మున్సిపాలిటీ ఎన్నికలను కూడా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News