మున్సిపల్ ఓటర్ల జాబితాపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు
మున్సిపల్ ఓటర్ల జాబితాపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు
Biksham
అభ్యంతరాలపై కలెక్టర్ పరిశీలన
ఏడు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో లోపాలున్నాయంటూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో కుల రిజర్వేషన్, వార్డు వారీ కేటాయింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, డూప్లికేట్ ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లు తొలగించలేదని ఆరోపిస్తూ సూర్యాపేటకు చెందిన డి శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఆర్ శ్రీధర్ వాదనలు వినిపించగా, ప్రభుత్వం, ఎన్నికల సంఘం, మున్సిపల్ అధికారుల తరఫున సంబంధిత న్యాయవాదులు వాదనలు వినిపించారు.వాదనలు విన్న అనంతరం కోర్టు స్పందిస్తూ, పిటిషనర్ జనవరి 19న ఇచ్చిన అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించాలని ఆదేశించింది. కుల రిజర్వేషన్, వార్డు వారీ రిజర్వేషన్ కేటాయింపుల్లో ఉన్న లోపాలపై పిటిషనర్కు వాదించే అవకాశం కల్పించి, చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్కు స్పష్టం చేసింది.హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను అత్యవసరంగా పూర్తి చేయాలని, ఆదేశాల ప్రతిని స్వీకరించిన తేదీ నుంచి ఏడు రోజుల్లోపు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొంది. ఈ వ్యవహారాన్ని ఫిబ్రవరి 20న మళ్లీ విచారణకు లిస్టు చేసింది.
సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన ఈ ఆదేశాలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తుది ఓటర్ల జాబితా, కుల రిజర్వేషన్ అంశాలపై కలెక్టర్ తీసుకునే నిర్ణయంతోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్పై స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ పరిణామాలతో సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై తాత్కాలిక ఉత్కంఠ నెలకొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి