మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ మెజారిటీకి కృషి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ మెజారిటీకి కృషి
Biksham Goud
రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి అభినందనలు
సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించేందుకు కృషి చేసిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి జిల్లా కాంగ్రెస్ న్యాయ విభాగం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ న్యాయ విభాగం అధ్యక్షులు నూకల సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ విజయానికి సర్వోత్తమ్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పార్టీ మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో న్యాయవాదులు సినేపల్లి సోమేశ్వర్, దొరేపల్లి రమేష్, కోణం రఘురామయ్య, బత్తిని వెంకటేశ్వర్లు, పోలేబోయిన నరేష్ పిళ్లే, పత్తిపాక రాధాకృష్ణ, అనంతుల సందీప్, బాలరాజ, సైదులు గౌడ్ , తరుణ్ గ, వీరేశం తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి