Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:16 AM

మున్సిపల్ ఎన్నికల విధుల్లో అప్రమత్తత తప్పనిసరి

మున్సిపల్ ఎన్నికల విధుల్లో అప్రమత్తత తప్పనిసరి

మున్సిపల్ ఎన్నికల విధుల్లో అప్రమత్తత తప్పనిసరి
January 30, 2026 06:51 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రిసైడింగ్ అధికారులే ఎన్నికల విజయానికి కీలకం

మున్సిపాలిటీ ఎన్నికల విధుల పట్ల ప్రిసైడింగ్ అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు స్పష్టం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల విధులకు నియమించబడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధుల్లో చేరాలని, ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. పోలింగ్‌కు సంబంధించిన సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాలని, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ పెట్టెలను ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని సూచించారు.


ముఖ్యంగా పోలింగ్ పెట్టె తెరవడం, మూసివేయడం, ముద్ర వేయడం వంటి ప్రక్రియల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.పోలింగ్ సామగ్రి స్వీకరణ మొదలుకొని పోలింగ్ ముగిసే వరకు ప్రతి దశలో అప్రమత్తత అవసరమన్నారు. ఓటర్లకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు అందించాలన్నారు.ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ మొత్తం నిష్పక్షపాతంగా సాగాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, మాస్టర్ శిక్షకుడు నర్సిరెడ్డి, ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News