Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:13 AM

ముఖ గుర్తింపు విధానం రద్దు చేయాలి: నర్సింహ్మ

ముఖ గుర్తింపు విధానం రద్దు చేయాలి: నర్సింహ్మ

ముఖ గుర్తింపు విధానం రద్దు చేయాలి: నర్సింహ్మ
06-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, వృద్ధాప్య పెన్షన్ల కోసం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత గుర్తింపు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ డిమాండ్ చేశారు.

బుధవారం భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం, బస్వాపురం గ్రామాల్లో పెన్షన్ లబ్ధిదారుల సమస్యలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. వేలిముద్రలు సరిపోని వృద్ధులు, దివ్యాంగులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఫేస్ రికగ్నిషన్ విధానం సరిగా పనిచేయక మరింత ఇబ్బందులు పెరుగుతున్నాయని తెలిపారు.

ఎండ తీవ్రతలో వృద్ధులు పలు మార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, మొబైల్‌లో ముఖ గుర్తింపు సరిగా రాకపోవడంతో పెన్షన్లు పొందడంలో ఆలస్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి అవినీతి ఘటనలను సాకుగా చూపిస్తూ అన్ని లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముఖ గుర్తింపు విధానాన్ని రద్దు చేసి పాత విధానంలోనే పెన్షన్లు అందజేయాలని ఆయన కోరారు.

Sthanikam

ముఖ గుర్తింపు విధానం రద్దు చేయాలి: నర్సింహ్మ

Article Image

భువనగిరి, వృద్ధాప్య పెన్షన్ల కోసం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత గుర్తింపు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ డిమాండ్ చేశారు.

బుధవారం భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం, బస్వాపురం గ్రామాల్లో పెన్షన్ లబ్ధిదారుల సమస్యలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. వేలిముద్రలు సరిపోని వృద్ధులు, దివ్యాంగులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఫేస్ రికగ్నిషన్ విధానం సరిగా పనిచేయక మరింత ఇబ్బందులు పెరుగుతున్నాయని తెలిపారు.

ఎండ తీవ్రతలో వృద్ధులు పలు మార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, మొబైల్‌లో ముఖ గుర్తింపు సరిగా రాకపోవడంతో పెన్షన్లు పొందడంలో ఆలస్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి అవినీతి ఘటనలను సాకుగా చూపిస్తూ అన్ని లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముఖ గుర్తింపు విధానాన్ని రద్దు చేసి పాత విధానంలోనే పెన్షన్లు అందజేయాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News