ముఖ గుర్తింపు విధానం రద్దు చేయాలి: నర్సింహ్మ
ముఖ గుర్తింపు విధానం రద్దు చేయాలి: నర్సింహ్మ
Editor Desk
భువనగిరి, వృద్ధాప్య పెన్షన్ల కోసం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత గుర్తింపు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ డిమాండ్ చేశారు.
బుధవారం భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం, బస్వాపురం గ్రామాల్లో పెన్షన్ లబ్ధిదారుల సమస్యలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. వేలిముద్రలు సరిపోని వృద్ధులు, దివ్యాంగులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఫేస్ రికగ్నిషన్ విధానం సరిగా పనిచేయక మరింత ఇబ్బందులు పెరుగుతున్నాయని తెలిపారు.
ఎండ తీవ్రతలో వృద్ధులు పలు మార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, మొబైల్లో ముఖ గుర్తింపు సరిగా రాకపోవడంతో పెన్షన్లు పొందడంలో ఆలస్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి అవినీతి ఘటనలను సాకుగా చూపిస్తూ అన్ని లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముఖ గుర్తింపు విధానాన్ని రద్దు చేసి పాత విధానంలోనే పెన్షన్లు అందజేయాలని ఆయన కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి