Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాకతీయ నగర్ డివిజన్‌లలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం பதவியேற்கும் முன்பே விஜய் அதிரடி தீர்மானம்! డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 06, 2026 06:05 PM

ముఖ గుర్తింపు విధానం రద్దు చేయాలి: నర్సింహ్మ

ముఖ గుర్తింపు విధానం రద్దు చేయాలి: నర్సింహ్మ

ముఖ గుర్తింపు విధానం రద్దు చేయాలి: నర్సింహ్మ
May 06, 2026 05:05 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, వృద్ధాప్య పెన్షన్ల కోసం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత గుర్తింపు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ డిమాండ్ చేశారు.

బుధవారం భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం, బస్వాపురం గ్రామాల్లో పెన్షన్ లబ్ధిదారుల సమస్యలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. వేలిముద్రలు సరిపోని వృద్ధులు, దివ్యాంగులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఫేస్ రికగ్నిషన్ విధానం సరిగా పనిచేయక మరింత ఇబ్బందులు పెరుగుతున్నాయని తెలిపారు.

ఎండ తీవ్రతలో వృద్ధులు పలు మార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, మొబైల్‌లో ముఖ గుర్తింపు సరిగా రాకపోవడంతో పెన్షన్లు పొందడంలో ఆలస్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి అవినీతి ఘటనలను సాకుగా చూపిస్తూ అన్ని లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముఖ గుర్తింపు విధానాన్ని రద్దు చేసి పాత విధానంలోనే పెన్షన్లు అందజేయాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News