ముగ్గుల పోటీలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి: కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి
ముగ్గుల పోటీలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి: కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
ముగ్గుల పోటీలు మహిళల్లో సృజనాత్మకతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి అన్నారు.
వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు–రమాదేవి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి, విజేతలను అభినందించారు.
ఈ సందర్భంగా మొద్దు లచ్చి రెడ్డి మాట్లాడుతూ, సంప్రదాయ పండుగలు సామాజిక ఐక్యతను పెంపొందించడంతో పాటు మహిళల ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వనస్థలిపురం డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు నూతి శ్రీనివాస్, జడ్జీలు అంజిరెడ్డి, సీనా రెడ్డి, బుగ్గరెడ్డి, నాయకులు చిన్న యాదవ్, కౌశిక్, భార్గవ్, దిలీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి