Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:37 AM

ముగ్గుల పోటీలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి: కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

ముగ్గుల పోటీలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి: కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

ముగ్గుల పోటీలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి: కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి
January 11, 2026 06:47 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ముగ్గుల పోటీలు మహిళల్లో సృజనాత్మకతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి అన్నారు.

వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు–రమాదేవి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి, విజేతలను అభినందించారు.

ఈ సందర్భంగా మొద్దు లచ్చి రెడ్డి మాట్లాడుతూ, సంప్రదాయ పండుగలు సామాజిక ఐక్యతను పెంపొందించడంతో పాటు మహిళల ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వనస్థలిపురం డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు నూతి శ్రీనివాస్, జడ్జీలు అంజిరెడ్డి, సీనా రెడ్డి, బుగ్గరెడ్డి, నాయకులు చిన్న యాదవ్, కౌశిక్, భార్గవ్, దిలీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News