Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:04 AM

ముగ్గుల పోటీలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి: కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

ముగ్గుల పోటీలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి: కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

ముగ్గుల పోటీలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి: కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి
January 11, 2026 06:47 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ముగ్గుల పోటీలు మహిళల్లో సృజనాత్మకతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి అన్నారు.

వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు–రమాదేవి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి, విజేతలను అభినందించారు.

ఈ సందర్భంగా మొద్దు లచ్చి రెడ్డి మాట్లాడుతూ, సంప్రదాయ పండుగలు సామాజిక ఐక్యతను పెంపొందించడంతో పాటు మహిళల ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వనస్థలిపురం డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు నూతి శ్రీనివాస్, జడ్జీలు అంజిరెడ్డి, సీనా రెడ్డి, బుగ్గరెడ్డి, నాయకులు చిన్న యాదవ్, కౌశిక్, భార్గవ్, దిలీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News