Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:02 AM

మృత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య నివాళులు

మృత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య నివాళులు

  మృత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య    నివాళులు
January 28, 2026 05:36 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నకిరేకల్ మున్సిపాలిటీ 20వ వార్డుకు చెందిన గంగాధర ప్రశాంత్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబంలో శోకం నెలకొంది. ఈ విషయాన్ని తెలుసుకున్న నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య మృతుని నివాసానికి వెళ్లి పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నకిరేకల్ మున్సిపాలిటీ 16వ వార్డుకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ మాతృమూర్తి అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె పార్థీవదేహాన్ని సందర్శించిన చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చి, ఈ కష్ట సమయంలో తమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యసానుభూతి మాటలు బాధిత కుటుంబాలకు ధైర్యాన్నిచ్చినట్టు స్థానికులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News