మొబైల్ రీల్స్ మోజులో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం తప్పిన పెను ప్రమాదం
మొబైల్ రీల్స్ మోజులో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం తప్పిన పెను ప్రమాదం
Komidala Mahender reddy
స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
నల్గొండ:
కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ మొబైల్ ఫోన్ మోజులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు, బస్సు డ్రైవర్ మొబైల్ ఫోన్లో రీల్స్ చూస్తూ వాహనం నడిపినట్లు సమాచారం. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపై ఉన్న డివైడర్ను ఎక్కింది. ఒక్కసారిగా బస్సు కుదుపులకు గురికావడంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు.
అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలు కాగా, వారిని స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించారు. గాయపడిన ప్రయాణికులంతా అదే బస్సులో ప్రయాణాన్ని కొనసాగించి గమ్యస్థానాలకు చేరుకున్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరగడానికి తృటిలో తప్పిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వాహనాలను నడిపే డ్రైవర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మొబైల్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి