మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా కందిమల్ల గోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా కందిమల్ల గోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా నీర్నేముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా వెలగపురి జనని, కోళ్ల రామకృష్ణలు, ప్రధాన కార్యదర్శిగా గంగాదేవి స్వామి ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా బద్దం యాదమ్మ, బంటిక శ్రీను, చిల్ల మధురవేణి, నారపాక మాధవిలను ఏకగ్రీవంగా ఎంపిక
ఈ ఎన్నికతో మండలంలో గ్రామ పంచాయతీల సమస్యలపై సమిష్టిగా ప్రభుత్వాన్ని ఆశ్రయించే అవకాశం ఏర్పడిందని, నిధులు, అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల అంశాల్లో సర్పంచుల ఫోరం కీలక పాత్ర పోషించనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఈ ఎన్నిక కార్యక్రమం లో రామన్నపేట మండలంలోని పలువురు గ్రామ సర్పంచ్లు పాల్గొన్నారు. రామన్నపేట సర్పంచ్ గరిక సత్య నారాయణ, కొమ్మాయిగూడెం సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి, శోభనాధపురం సర్పంచ్ కంచి మధుసూదన్, జనంపెళ్లి సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి, ఇసిల్ల సర్పంచ్ పైళ్ల చందన వెంకటరెడ్డి, బాచుప్పల మాధవి భూపాల్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర నాయకులు గంగుల వెంకట్ రాజిరెడ్డి, జినుకల ప్రభాకర్, బత్తుల కృష్ణ గౌడ్, పూస బాలకృష్ణ, నంద్యాల బిక్షం రెడ్డి, గుత్త నర్సిరెడ్డి, ఎండి జమీరుద్దీన్, బొడ్డు సురేందర్ రావు, ఎర్ర శేఖర్, ఆవుల నరసింహ, నోముల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి