Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:06 PM

మంత్రి వాకిటి శ్రీహరికి దివ్యాంగుల వినతిపత్రం. విద్య, ఉపాధి, పెన్షన్లపై చర్చ

మంత్రి వాకిటి శ్రీహరికి దివ్యాంగుల వినతిపత్రం. విద్య, ఉపాధి, పెన్షన్లపై చర్చ

మంత్రి వాకిటి శ్రీహరికి దివ్యాంగుల వినతిపత్రం. విద్య, ఉపాధి, పెన్షన్లపై చర్చ
May 23, 2026 05:54 PM 180 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు మరియు యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ని శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో దివ్యాంగుల ప్రతినిధులు, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం సభ్యులు కలిసి దివ్యాంగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా దివ్యాంగులు విద్య, ఉపాధి అవకాశాలు, పెన్షన్లు, స్వయం ఉపాధి పథకాలు, హాస్టల్ మరియు రవాణా సౌకర్యాలపై మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ.. దివ్యాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పనిచేస్తోందని తెలిపారు. వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ చెరుకు నాగభూషణ్, వీరభద్రయ్య యాదవ్, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్, ఉపాధ్యక్షుడు మారవేణి చంద్రశేఖర్ యాదవ్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు దానమ్మ, సహాయ కార్యదర్శులు మోదాల సైదులు యాదవ్, వేణుగౌడ్, గుండ్లపల్లి నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News