మంత్రి వాకిటి శ్రీహరికి దివ్యాంగుల వినతిపత్రం. విద్య, ఉపాధి, పెన్షన్లపై చర్చ
మంత్రి వాకిటి శ్రీహరికి దివ్యాంగుల వినతిపత్రం. విద్య, ఉపాధి, పెన్షన్లపై చర్చ
Editor Desk
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు మరియు యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ని శనివారం మినిస్టర్ క్వార్టర్స్లో దివ్యాంగుల ప్రతినిధులు, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం సభ్యులు కలిసి దివ్యాంగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దివ్యాంగులు విద్య, ఉపాధి అవకాశాలు, పెన్షన్లు, స్వయం ఉపాధి పథకాలు, హాస్టల్ మరియు రవాణా సౌకర్యాలపై మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ.. దివ్యాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పనిచేస్తోందని తెలిపారు. వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ చెరుకు నాగభూషణ్, వీరభద్రయ్య యాదవ్, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్, ఉపాధ్యక్షుడు మారవేణి చంద్రశేఖర్ యాదవ్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు దానమ్మ, సహాయ కార్యదర్శులు మోదాల సైదులు యాదవ్, వేణుగౌడ్, గుండ్లపల్లి నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి