Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:54 AM

మంత్రి వాకిటి శ్రీహరికి దివ్యాంగుల వినతిపత్రం. విద్య, ఉపాధి, పెన్షన్లపై చర్చ

మంత్రి వాకిటి శ్రీహరికి దివ్యాంగుల వినతిపత్రం. విద్య, ఉపాధి, పెన్షన్లపై చర్చ

మంత్రి వాకిటి శ్రీహరికి దివ్యాంగుల వినతిపత్రం. విద్య, ఉపాధి, పెన్షన్లపై చర్చ
23-05-2026 212 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు మరియు యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ని శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో దివ్యాంగుల ప్రతినిధులు, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం సభ్యులు కలిసి దివ్యాంగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా దివ్యాంగులు విద్య, ఉపాధి అవకాశాలు, పెన్షన్లు, స్వయం ఉపాధి పథకాలు, హాస్టల్ మరియు రవాణా సౌకర్యాలపై మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ.. దివ్యాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పనిచేస్తోందని తెలిపారు. వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ చెరుకు నాగభూషణ్, వీరభద్రయ్య యాదవ్, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్, ఉపాధ్యక్షుడు మారవేణి చంద్రశేఖర్ యాదవ్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు దానమ్మ, సహాయ కార్యదర్శులు మోదాల సైదులు యాదవ్, వేణుగౌడ్, గుండ్లపల్లి నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మంత్రి వాకిటి శ్రీహరికి దివ్యాంగుల వినతిపత్రం. విద్య, ఉపాధి, పెన్షన్లపై చర్చ

Article Image

హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు మరియు యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ని శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో దివ్యాంగుల ప్రతినిధులు, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం సభ్యులు కలిసి దివ్యాంగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా దివ్యాంగులు విద్య, ఉపాధి అవకాశాలు, పెన్షన్లు, స్వయం ఉపాధి పథకాలు, హాస్టల్ మరియు రవాణా సౌకర్యాలపై మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ.. దివ్యాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పనిచేస్తోందని తెలిపారు. వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ చెరుకు నాగభూషణ్, వీరభద్రయ్య యాదవ్, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్, ఉపాధ్యక్షుడు మారవేణి చంద్రశేఖర్ యాదవ్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు దానమ్మ, సహాయ కార్యదర్శులు మోదాల సైదులు యాదవ్, వేణుగౌడ్, గుండ్లపల్లి నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News