Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:58 PM

మిస్సింగ్ కేసుల ఛేదనలో టెక్నాలజీ వినియోగం.కర్నూలు పోలీసుల పనితీరుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడి

మిస్సింగ్ కేసుల ఛేదనలో టెక్నాలజీ వినియోగం.కర్నూలు పోలీసుల పనితీరుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడి

మిస్సింగ్ కేసుల ఛేదనలో టెక్నాలజీ వినియోగం.కర్నూలు పోలీసుల పనితీరుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడి
May 24, 2026 07:17 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

FRS సిస్టమ్‌తో కనిపించని వ్యక్తుల గుర్తింపు

కర్నూలు,: మిస్సింగ్ కేసుల ఛేదనలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కర్నూలు పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కనిపించకుండా పోయిన వ్యక్తులను గుర్తించడంలో FRS (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సర్వీసుల భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల అనలిటిక్స్ కెమెరాలు ఏర్పాటు చేయగా, కర్నూలు జిల్లాలో 722 మ్యాట్రిక్స్ స్మార్ట్ టెక్నాలజీ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో FRS, ANPR తదితర సాంకేతిక వ్యవస్థలు అమలులో ఉన్నాయని చెప్పారు.

ఈ కెమెరాలన్నీ అమరావతిలోని RTGS కంట్రోల్ రూమ్ ద్వారా CCTNS AP-360 యాప్ సహాయంతో పర్యవేక్షించబడుతున్నాయని, జిల్లా కంట్రోల్ రూమ్‌లు, పోలీస్ స్టేషన్లతో అనుసంధానించబడినట్లు వివరించారు.

ఇటీవల కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసులో కనిపించకుండా పోయిన వ్యక్తిని మదనపల్లిలో గుర్తించినట్లు తెలిపారు. అలాగే పెద్దకడుబూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో బాధితుడిని తిరుపతిలో, నందవరం పోలీస్ స్టేషన్ కేసులో వ్యక్తిని విజయవాడలో గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

FRS టెక్నాలజీ వ్యక్తుల ముఖాలను స్కాన్ చేసి, పోలీసుల డేటాబేస్‌లోని ఫోటోలతో పోల్చి గుర్తించే వ్యవస్థ అని ఎస్పీ వివరించారు. ఇదే సాంకేతికత ద్వారా పరారీలో ఉన్న నిందితులు, నేరచరిత్ర కలిగిన వ్యక్తుల అనుమానాస్పద కదలికలపై కూడా కమాండ్ కంట్రోల్ రూమ్‌కు వెంటనే అలర్ట్‌లు అందుతున్నాయని తెలిపారు.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News