Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:46 PM

మునిసిపల్ ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి

మునిసిపల్ ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి

మునిసిపల్ ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి
January 08, 2026 07:38 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అభ్యంతరాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితా విడుదలకు అదనపు కలెక్టర్ ఆదేశాలు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, నిర్ణీత గడువులో త్వరతగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.గురువారం భువనగిరి పురపాలక సంఘ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ సందర్శించి మునిసిపల్ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఫోటో ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటో ఓటరు జాబితాల ప్రకటనపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండేలా పర్యవేక్షించాలని, ఒకే కుటుంబానికి చెందిన అర్హులైన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, విచారణ పూర్తిచేసి వార్డు వారీగా జనవరి 12, 2026 న తుది ఓటర్ల జాబితాను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురించాలని ఆదేశించారు.అలాగే జనవరి 13, 2026 న పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రదర్శించి, జనవరి 16, 2026 న పోలింగ్ కేంద్రాల వారీగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని మునిసిపల్ కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ రామలింగం, మేనేజర్, వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News