మునిసిపల్ ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి
మునిసిపల్ ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి
Editor Desk
అభ్యంతరాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితా విడుదలకు అదనపు కలెక్టర్ ఆదేశాలు
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, నిర్ణీత గడువులో త్వరతగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.గురువారం భువనగిరి పురపాలక సంఘ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ సందర్శించి మునిసిపల్ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఫోటో ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటో ఓటరు జాబితాల ప్రకటనపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండేలా పర్యవేక్షించాలని, ఒకే కుటుంబానికి చెందిన అర్హులైన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, విచారణ పూర్తిచేసి వార్డు వారీగా జనవరి 12, 2026 న తుది ఓటర్ల జాబితాను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురించాలని ఆదేశించారు.అలాగే జనవరి 13, 2026 న పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రదర్శించి, జనవరి 16, 2026 న పోలింగ్ కేంద్రాల వారీగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని మునిసిపల్ కమిషనర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ రామలింగం, మేనేజర్, వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి