PRINT TIME: April 10, 2026 09:09 AM
మౌలాలి చిల్ల దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
మౌలాలి చిల్ల దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
January 06, 2026 07:21 PM
551 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్న పేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట మండల కేంద్రంలోని మౌలాలి చిల్ల దర్గా ఉర్సు ఉత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. ముతవల్లి, ముజావర్ ఎండి జానీ పాషా నివాసం నుండి గంధం ఊరేగింపుతో ఉత్సవాలకు ఆరంభం పలికారు. అనంతరం మౌలాలి దర్గా వద్ద నైవేద్యంగా గంధం సమర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ గరిక సత్యనారాయణ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా ప్రజలు ఐక్యతతో ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలు సుఖశాంతులతో, ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఉత్సవాల్లో ఉపసర్పంచ్ మోటె రమేష్, నాయకులు ఎండి జమీరుద్దీన్, వనం చంద్రశేఖర్, జెల్ల వెంకటేశం, ఎండి అక్రమ్, ఎండి నాసర్, వార్డు సభ్యులు హరిబాబు, కొమ్ము శేఖర్, నూర్జహా అన్వర్, అంజద్, కొమ్ము రామస్వామి, గొరిగే శేఖర్, సుదర్శన్ తదితరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉర్సు ఉత్సవాలు భక్తుల సందడితో ఉత్సాహంగా కొనసాగాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి