మన వార్డు మన బాధ్యత – పరిశుభ్రతతోనే ఆరోగ్యం నీర్నెముల 7వ వార్డులో శుభ్రత కార్యక్రమం
మన వార్డు మన బాధ్యత – పరిశుభ్రతతోనే ఆరోగ్యం నీర్నెముల 7వ వార్డులో శుభ్రత కార్యక్రమం
స్థానికం బృందం
మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని నీర్నెముల గ్రామానికి చెందిన 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్ అన్నారు. శుక్రవారం రోజున వార్డులోని వివిధ వీధుల్లో సిబ్బందితో కలిసి మోరీలు, చెత్తను తొలగించే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండ్ల వద్ద లేదా మోరీల వద్ద చెత్తను వేయకూడదని ప్రజలకు సూచించారు. చెత్త పేరుకుపోతే మోరీలలో నీరు నిలిచి దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తొలగించిన చెత్తను కాల్చివేసి, వార్డును శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సస్యశామలంగా తీర్చిదిద్దుతానని చినపాక రమేష్ స్పష్టం చేశారు. పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి