Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:42 PM

మన వార్డు మన బాధ్యత – పరిశుభ్రతతోనే ఆరోగ్యం నీర్నెముల 7వ వార్డులో శుభ్రత కార్యక్రమం

మన వార్డు మన బాధ్యత – పరిశుభ్రతతోనే ఆరోగ్యం నీర్నెముల 7వ వార్డులో శుభ్రత కార్యక్రమం

మన వార్డు మన బాధ్యత – పరిశుభ్రతతోనే ఆరోగ్యం నీర్నెముల 7వ వార్డులో శుభ్రత కార్యక్రమం
30-01-2026 227 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని నీర్నెముల గ్రామానికి చెందిన 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్ అన్నారు. శుక్రవారం రోజున వార్డులోని వివిధ వీధుల్లో సిబ్బందితో కలిసి మోరీలు, చెత్తను తొలగించే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండ్ల వద్ద లేదా మోరీల వద్ద చెత్తను వేయకూడదని ప్రజలకు సూచించారు. చెత్త పేరుకుపోతే మోరీలలో నీరు నిలిచి దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తొలగించిన చెత్తను కాల్చివేసి, వార్డును శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సస్యశామలంగా తీర్చిదిద్దుతానని చినపాక రమేష్ స్పష్టం చేశారు. పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

Sthanikam

మన వార్డు మన బాధ్యత – పరిశుభ్రతతోనే ఆరోగ్యం నీర్నెముల 7వ వార్డులో శుభ్రత కార్యక్రమం

Article Image

మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని నీర్నెముల గ్రామానికి చెందిన 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్ అన్నారు. శుక్రవారం రోజున వార్డులోని వివిధ వీధుల్లో సిబ్బందితో కలిసి మోరీలు, చెత్తను తొలగించే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండ్ల వద్ద లేదా మోరీల వద్ద చెత్తను వేయకూడదని ప్రజలకు సూచించారు. చెత్త పేరుకుపోతే మోరీలలో నీరు నిలిచి దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తొలగించిన చెత్తను కాల్చివేసి, వార్డును శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సస్యశామలంగా తీర్చిదిద్దుతానని చినపాక రమేష్ స్పష్టం చేశారు. పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News