Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:54 AM

మల్లన్న గుట్టపై భక్తుల మహాసంద్రం కార్తీక అమావాస్యన ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం

మల్లన్న గుట్టపై భక్తుల మహాసంద్రం కార్తీక అమావాస్యన ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం

మల్లన్న గుట్టపై భక్తుల మహాసంద్రం  కార్తీక అమావాస్యన ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం
January 19, 2026 07:08 AM 222 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భక్తుల రద్దీ పెరుగుతున్నా… వసతులు ఎక్కడ?

మల్లన్న ఆలయంలో కనీస సౌకర్యాల కరవు

భక్తుల ఆవేదన పట్టించుకోని అధికారులు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మండలంలోని నిధానపల్లి మల్లన్న గుట్టపై వెలసిన శ్రీ స్వయంభూ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి అదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. పుష్య మాసం, అమావాస్య కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించారు.

అమావాస్యను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చకులు బేతోజు సత్యనారాయణ శాస్త్రి, శశిధర్ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం పట్టువస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో ఉత్సవ విగ్రహాలను అలంకరించి ఆలయ ప్రాంగణంలో కళ్యాణ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు.ఈ కళ్యాణోత్సవంలో కొండ రాజేందర్ సరిత దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని దీపోత్సవాలు నిర్వహించి తమ కోరికలు మొక్కుకున్నారు.అనంతరం రుద్రగార్ధం ఉమాపతి, మిర్యాల ఉమాపతి, గణేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమరేందర్, కొంగర్ సురేందర్, రాపోలు అమరేందర్, ఉపేందర్‌తో పాటు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కనీస వసతుల లేమితో భక్తుల అవస్థలు

తాగునీరు, మరుగుదొడ్లు లేక మహిళలకు ఇబ్బందులు

భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలా వెలసిల్లుతున్న శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో కనీస సౌకర్యాల లేమి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతున్నా తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది.విశాలమైన ప్రదేశం కావడంతో ముఖ్యంగా మహిళలు మలమూత్ర విసర్జనకు తీవ్ర అవస్థలు పడుతున్నారని భక్తులు వాపోతున్నారు. ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా తక్షణమే సమస్యలను పరిష్కరించి అదనపు సౌకర్యాలు కల్పించాలని భక్తులు, మహిళలు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News