Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:08 PM

మల్లన్న గుట్టపై భక్తుల మహాసంద్రం కార్తీక అమావాస్యన ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం

మల్లన్న గుట్టపై భక్తుల మహాసంద్రం కార్తీక అమావాస్యన ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం

మల్లన్న గుట్టపై భక్తుల మహాసంద్రం  కార్తీక అమావాస్యన ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం
January 19, 2026 07:08 AM 218 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భక్తుల రద్దీ పెరుగుతున్నా… వసతులు ఎక్కడ?

మల్లన్న ఆలయంలో కనీస సౌకర్యాల కరవు

భక్తుల ఆవేదన పట్టించుకోని అధికారులు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మండలంలోని నిధానపల్లి మల్లన్న గుట్టపై వెలసిన శ్రీ స్వయంభూ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి అదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. పుష్య మాసం, అమావాస్య కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించారు.

అమావాస్యను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చకులు బేతోజు సత్యనారాయణ శాస్త్రి, శశిధర్ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం పట్టువస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో ఉత్సవ విగ్రహాలను అలంకరించి ఆలయ ప్రాంగణంలో కళ్యాణ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు.ఈ కళ్యాణోత్సవంలో కొండ రాజేందర్ సరిత దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని దీపోత్సవాలు నిర్వహించి తమ కోరికలు మొక్కుకున్నారు.అనంతరం రుద్రగార్ధం ఉమాపతి, మిర్యాల ఉమాపతి, గణేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమరేందర్, కొంగర్ సురేందర్, రాపోలు అమరేందర్, ఉపేందర్‌తో పాటు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కనీస వసతుల లేమితో భక్తుల అవస్థలు

తాగునీరు, మరుగుదొడ్లు లేక మహిళలకు ఇబ్బందులు

భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలా వెలసిల్లుతున్న శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో కనీస సౌకర్యాల లేమి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతున్నా తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది.విశాలమైన ప్రదేశం కావడంతో ముఖ్యంగా మహిళలు మలమూత్ర విసర్జనకు తీవ్ర అవస్థలు పడుతున్నారని భక్తులు వాపోతున్నారు. ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా తక్షణమే సమస్యలను పరిష్కరించి అదనపు సౌకర్యాలు కల్పించాలని భక్తులు, మహిళలు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News