Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:31 AM

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్‌లో భారీ చేరికలు

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్‌లో భారీ చేరికలు

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్‌లో భారీ చేరికలు
February 03, 2026 05:12 AM 241 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భంగా బిజెపి యువ నాయకుడు, 46వ వార్డు మాజీ కౌన్సిలర్ కట్కూరి కార్తీక్ రెడ్డి, 17వ వార్డు కాంగ్రెస్ నాయకులు మల్లయ్య జ్యోత్స్న, 27వ వార్డు మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకురాలు సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మతో పాటు సుమారు వందమంది ఆయా పార్టీలకు రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. అభివృద్ధి అంటే పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే జరిగిందని తెలిపారు. అభివృద్ధిని కాంక్షించే ప్రజలు, నాయకులు బిఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ ఇస్లావత్ రాంచంద్ర నాయక్, రాష్ట్ర కార్యదర్శి వైవి, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు గోపగాని వెంకట నారాయణ గౌడ్, జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, మారిపెద్ధి శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, కీసర వేణుగోపాల్ రెడ్డి, సిరివెళ్ల శబరి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News