మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్లో భారీ చేరికలు
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్లో భారీ చేరికలు
Biksham Goud
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భంగా బిజెపి యువ నాయకుడు, 46వ వార్డు మాజీ కౌన్సిలర్ కట్కూరి కార్తీక్ రెడ్డి, 17వ వార్డు కాంగ్రెస్ నాయకులు మల్లయ్య జ్యోత్స్న, 27వ వార్డు మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకురాలు సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మతో పాటు సుమారు వందమంది ఆయా పార్టీలకు రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. అభివృద్ధి అంటే పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే జరిగిందని తెలిపారు. అభివృద్ధిని కాంక్షించే ప్రజలు, నాయకులు బిఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ ఇస్లావత్ రాంచంద్ర నాయక్, రాష్ట్ర కార్యదర్శి వైవి, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు గోపగాని వెంకట నారాయణ గౌడ్, జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, మారిపెద్ధి శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, కీసర వేణుగోపాల్ రెడ్డి, సిరివెళ్ల శబరి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి