Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:06 AM

మాజీ గవర్నర్ చేతుల మీదుగా ఉపసర్పంచ్ మోట్ రమేష్‌కు ఘన సన్మానం

మాజీ గవర్నర్ చేతుల మీదుగా ఉపసర్పంచ్ మోట్ రమేష్‌కు ఘన సన్మానం

మాజీ గవర్నర్ చేతుల మీదుగా ఉపసర్పంచ్ మోట్ రమేష్‌కు ఘన సన్మానం
12-01-2026 348 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్‌లోని సుదరయ్య విజ్ఞాన కేంద్రంలో కురుమ యువ చైతన్య కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ మోట్ రమేష్‌కు ప్రత్యేకంగా సన్మానం అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్, గద్వాల్ మాజీ జడ్పీ చైర్మన్ సరిత అక్క, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమా హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా మోట్ రమేష్‌ను శాలువాతో సత్కరించి స్మారక చిహ్నాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, గ్రామ పాలనలో ఉపసర్పంచ్‌ల పాత్ర కీలకమని, ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల నమ్మకంతో ఎన్నికైన ప్రతినిధులు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు.
ఈ సన్మాన కార్యక్రమంలో బండ లింగస్వామి, మోట్ మహేష్, సిందం వేణు, మధు తదితరులు పాల్గొని మోట్ రమేష్‌కు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో సమర్థవంతమైన పాలనకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహం కలిగిస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
Sthanikam

మాజీ గవర్నర్ చేతుల మీదుగా ఉపసర్పంచ్ మోట్ రమేష్‌కు ఘన సన్మానం

Article Image
హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్‌లోని సుదరయ్య విజ్ఞాన కేంద్రంలో కురుమ యువ చైతన్య కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ మోట్ రమేష్‌కు ప్రత్యేకంగా సన్మానం అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్, గద్వాల్ మాజీ జడ్పీ చైర్మన్ సరిత అక్క, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమా హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా మోట్ రమేష్‌ను శాలువాతో సత్కరించి స్మారక చిహ్నాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, గ్రామ పాలనలో ఉపసర్పంచ్‌ల పాత్ర కీలకమని, ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల నమ్మకంతో ఎన్నికైన ప్రతినిధులు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు.
ఈ సన్మాన కార్యక్రమంలో బండ లింగస్వామి, మోట్ మహేష్, సిందం వేణు, మధు తదితరులు పాల్గొని మోట్ రమేష్‌కు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో సమర్థవంతమైన పాలనకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహం కలిగిస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News