Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:36 AM

మాజీ గవర్నర్ చేతుల మీదుగా ఉపసర్పంచ్ మోట్ రమేష్‌కు ఘన సన్మానం

మాజీ గవర్నర్ చేతుల మీదుగా ఉపసర్పంచ్ మోట్ రమేష్‌కు ఘన సన్మానం

మాజీ గవర్నర్ చేతుల మీదుగా ఉపసర్పంచ్ మోట్ రమేష్‌కు ఘన సన్మానం
January 12, 2026 07:15 AM 325 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్‌లోని సుదరయ్య విజ్ఞాన కేంద్రంలో కురుమ యువ చైతన్య కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ మోట్ రమేష్‌కు ప్రత్యేకంగా సన్మానం అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్, గద్వాల్ మాజీ జడ్పీ చైర్మన్ సరిత అక్క, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమా హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా మోట్ రమేష్‌ను శాలువాతో సత్కరించి స్మారక చిహ్నాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, గ్రామ పాలనలో ఉపసర్పంచ్‌ల పాత్ర కీలకమని, ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల నమ్మకంతో ఎన్నికైన ప్రతినిధులు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు.
ఈ సన్మాన కార్యక్రమంలో బండ లింగస్వామి, మోట్ మహేష్, సిందం వేణు, మధు తదితరులు పాల్గొని మోట్ రమేష్‌కు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో సమర్థవంతమైన పాలనకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహం కలిగిస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News