Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:22 AM

మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ బాసట రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను వినియోగించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ బాసట రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను వినియోగించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ బాసట రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను వినియోగించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
January 24, 2026 10:13 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాల కోసం రూపొందించిన పోస్టర్‌ను స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆయన తెలిపారు.

జిల్లా కేంద్రంలోని ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జయమ్మ, రెసిడెన్షియల్ సమన్వయ అధికారి శ్రీకాంత్, ఉర్దూ మైనార్టీ అధికారి ఫౌజియా, మైనార్టీ రెసిడెన్షియల్ సంస్థల ప్రిన్సిపాళ్లు బాలకృష్ణ, శ్రీనివాస్, కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ముస్లిం మైనార్టీ విద్యార్థులు పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వసతి, భోజనం, విద్య వంటి సౌకర్యాలతో కూడిన ఈ విద్యాసంస్థలు మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మైనార్టీ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అధికారులు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News