Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:25 PM

మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ బాసట రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను వినియోగించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ బాసట రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను వినియోగించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ బాసట రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను వినియోగించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
January 24, 2026 10:13 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాల కోసం రూపొందించిన పోస్టర్‌ను స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆయన తెలిపారు.

జిల్లా కేంద్రంలోని ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జయమ్మ, రెసిడెన్షియల్ సమన్వయ అధికారి శ్రీకాంత్, ఉర్దూ మైనార్టీ అధికారి ఫౌజియా, మైనార్టీ రెసిడెన్షియల్ సంస్థల ప్రిన్సిపాళ్లు బాలకృష్ణ, శ్రీనివాస్, కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ముస్లిం మైనార్టీ విద్యార్థులు పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వసతి, భోజనం, విద్య వంటి సౌకర్యాలతో కూడిన ఈ విద్యాసంస్థలు మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మైనార్టీ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అధికారులు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News