Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:49 AM

మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ బాసట రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను వినియోగించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ బాసట రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను వినియోగించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ బాసట రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను వినియోగించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
January 24, 2026 10:13 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాల కోసం రూపొందించిన పోస్టర్‌ను స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆయన తెలిపారు.

జిల్లా కేంద్రంలోని ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జయమ్మ, రెసిడెన్షియల్ సమన్వయ అధికారి శ్రీకాంత్, ఉర్దూ మైనార్టీ అధికారి ఫౌజియా, మైనార్టీ రెసిడెన్షియల్ సంస్థల ప్రిన్సిపాళ్లు బాలకృష్ణ, శ్రీనివాస్, కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ముస్లిం మైనార్టీ విద్యార్థులు పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వసతి, భోజనం, విద్య వంటి సౌకర్యాలతో కూడిన ఈ విద్యాసంస్థలు మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మైనార్టీ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అధికారులు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News