Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:42 AM

మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి

మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి

మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి
January 14, 2026 08:08 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- ఐద్వ జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

(అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా)పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ బట్టుపల్లి శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ పట్టణ కార్యదర్శి కామ్రేడ్ ఉదయగిరి శ్రీనివాస్ మాజీ ఐలు జిల్లా నాయకులు గార్ల అమరవీరుల జ్ఞాపకార్ధంగా బహార్ పేటలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ హాజరై మాట్లాడుతూ...మహిళలపై అనేకదాడులు జరుగుతున్నాయని వాటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకుప్రతీకంగా నిలిచే సంక్రాంతి పండగ అని,ముగ్గులు వేయడంలో మహిళల యొక్క సృజనాత్మకతను వెలికి తీయడానికి దోహదపడతాయని అన్నారు. బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు హత్యలు ఎక్కువయ్యాయని పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి చట్టాలను ఆ చట్టాలను పటిష్టం చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు.అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళుతున్న తరుణంలోమనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తూ..మహిళలను వంటింటికే పరిమితం చేయాలనీ మనువాదం మహిళల హక్కులను అనిచివేస్తుందని ఆ మనువాదాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణీతలుగా జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి,పట్టణ కమిటీ సభ్యురాలు గద్దె లత,జిల్లా కమిటీ సభ్యురాలు,పట్టణ అధ్యక్షురాలు మాయ రాణి,పట్టణ కోశాధికారిగంధ మల్ల బాలమణి,ఎన్ పిఆర్ డి కొత్త లలిత,దండు స్వరూప,కార్యక్రమం అనంతరం పోటీలో పాల్గొన్న వారందరికీ బహుమతులు ప్రధానోత్సవం చేయడంజరిగింది. మొదటి బహుమతి బండారుకవిత,రెండవ బహుమతి ఆడపు చందన,మూడవ బహుమతి సాద్విక,ఈ కార్యక్రమంలో బండారు యాదమ్మ,బట్టుపల్లి జయశ్రీ,శ్యామల,అంజలి సునీత,స్వప్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News