మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక చేయూత: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక చేయూత: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి: కొండ మల్లేశం గౌడ్
మహిళల ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక పథకాల ద్వారా చేయూత అందిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక–ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ క్రమంలో వడ్డీ లేని రుణాల పథకం కింద పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్లతో కలిసి ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మెప్మా అధికారులు, బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల మంజూరు, అర్హులైన సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా లేని అర్హులైన మహిళలను రేషన్ కార్డుల ఆధారంగా గుర్తించాలని, పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి రద్దీ లేకుండా సక్రమమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మెప్మా అధికారి రమేష్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి