Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:49 AM

మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక చేయూత: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక చేయూత: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక చేయూత: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
January 19, 2026 07:18 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి: కొండ మల్లేశం గౌడ్

మహిళల ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక పథకాల ద్వారా చేయూత అందిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక–ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ క్రమంలో వడ్డీ లేని రుణాల పథకం కింద పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.


సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌లతో కలిసి ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మెప్మా అధికారులు, బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల మంజూరు, అర్హులైన సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా లేని అర్హులైన మహిళలను రేషన్ కార్డుల ఆధారంగా గుర్తించాలని, పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి రద్దీ లేకుండా సక్రమమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మెప్మా అధికారి రమేష్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News