Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:39 PM

మహిళల భద్రతకు అవగాహనే రక్షణ వెంకటాపురం కాలనీలో “మీ రక్షణ – మా బాధ్యత” కార్యక్రమం

మహిళల భద్రతకు అవగాహనే రక్షణ వెంకటాపురం కాలనీలో “మీ రక్షణ – మా బాధ్యత” కార్యక్రమం

మహిళల భద్రతకు అవగాహనే రక్షణ వెంకటాపురం కాలనీలో “మీ రక్షణ – మా బాధ్యత” కార్యక్రమం
May 21, 2026 06:51 AM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీలో మహిళలపై జరుగుతున్న నేరాల నివారణకు అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన “మీ రక్షణ – మా బాధ్యత” కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సంయుక్తంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి మాట్లాడుతూ బాలికల విద్య ప్రాముఖ్యత, బాల్య వివాహాల నివారణ, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించారు.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు, సైబర్ నేరాల నివారణ చర్యలపై వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, మహిళల సహాయ హెల్ప్‌లైన్ 181, మహిళల భద్రత కోసం 1091, బాలల సహాయానికి 1098, సైబర్ మోసాల ఫిర్యాదులకు 1930 నంబర్లను వినియోగించాలని సూచించారు. అవసరమైతే పోలీస్ స్టేషన్లలో కౌన్సెలింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నేటి బాలికలు విద్య ద్వారా అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసం, అవగాహనతో తమ హక్కులను తెలుసుకుని ముందుకు సాగాలని సూచించారు. బాల్య వివాహాలు, మహిళలపై నేరాల నివారణలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కీలకమని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఎమ్మిగనూరు రూరల్ సీఐ, టౌన్ ఎస్‌ఐ, నందవరం ఎస్‌ఐ, మున్సిపల్ కమిషనర్, ఎమ్మిగనూరు ఎంఆర్వో, రాష్ట్ర కుర్నీ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు, బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్, వీఎచ్‌పీ నాయకులు, మహిళా ప్రతినిధులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News