Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి సాధ్యం – విప్ బీర్ల ఐలయ్య సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:50 PM

మహిళా ఉద్యోగినిపై దుర్వ్యవహారం ఘటనకు కాంగ్రెస్‌కు సంబంధం లేదు

మహిళా ఉద్యోగినిపై దుర్వ్యవహారం ఘటనకు కాంగ్రెస్‌కు సంబంధం లేదు

మహిళా ఉద్యోగినిపై దుర్వ్యవహారం ఘటనకు కాంగ్రెస్‌కు సంబంధం లేదు
February 24, 2026 06:52 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


చట్టపరమైన చర్యలు పోలీసుల పరిధిలోనే – సీపీఐ ఆరోపణలు తప్పుడు ప్రచారం అంటూ మండిపాటు

ఏదులాపురం, ఫిబ్రవరి 24: మహిళా ఉద్యోగినిపై దుర్వ్యవహారం చేసిన ఘటనలో చట్టపరమైన చర్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. తప్పుడు పనులు చేస్తూ అధికార పార్టీపై బురదజల్లడం సీపీఐ నాయకులకే చెల్లిందని విమర్శించారు. వరంగల్ క్రాస్ రోడ్డులోని 29వ వార్డులో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. అవుట్ సోర్సింగ్ విధుల్లో భాగంగా గృహ నిర్మాణ శాఖ సిబ్బందితో వచ్చిన మహిళా ఉద్యోగినిని వందలాది మంది ముందే ఏదులాపురం మాజీ సర్పంచ్, సీపీఐ ఖమ్మం గ్రామీణ మండల నాయకుడు చెరుకుపల్లి భాస్కర్ దుర్భాషలాడారని ఆరోపించారు. ఈ ఘటనపై బాధితురాలు ఖమ్మం గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ సీపీఐ నాయకులు వాటిని పట్టించుకోకుండా వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా ఉద్యోగినిపై అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తికి వత్తాసు పలుకుతూ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేయకుండా స్థానిక కాంగ్రెస్ నాయకులపై అవాకులు చెవాకులు పేల్చడం సరికాదన్నారు. సీపీఐపై రాజకీయ కక్షలు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని, కానీ నిజాలను వక్రీకరించి ఆరోపణలు చేయడం అంగీకరించబోమన్నారు. సోషల్ మాధ్యమాల్లో ప్రజలు స్వయంగా వీడియోలు చూసారని, వాటిని సరిదిద్దుకోవాలనే మనసు సీపీఐ నాయకులకు లేకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి కాంగ్రెస్‌పై ఆరోపణలు మానుకోవాలని, గుడ్డ కాల్చి మీదేసే ధోరణి విడిచిపెట్టాలని సీపీఐ నాయకులకు హితవు పలికారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, 29వ వార్డు కౌన్సిలర్ వెంపటి ఉమా వెంకటేశ్వర్లు, భూక్యా సురేష్ నాయక్, వెంపటి రవి, వెంపటి సురేష్, ప్రద్యుమ్న చారి, నూకల రామ్మోహన్ రెడ్డి, శిరిషా రంజిత్ రెడ్డి, కళ్ళెం శేషిరెడ్డి, ఎర్ర శేఖర్ రెడ్డి, రామిశెట్టి రమేష్, అశోక్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, సురేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News