ప్రిన్సిపల్ సెక్రటరీ ఆకస్మికంగా అంగన్వాడి, వయో వృద్ధుల కేంద్రాలను తనిఖీ
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
మహిళా, శిశు, వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ ప్రిన్సిప్రల్ సెక్రటరీ శ్రీమతి శ్రీ అనితా రామచంద్రన్ గారు ఈరోజు భువనగిరి ప్రాజెక్ట్ పరిధిలోని బీబీనగర్ ప్రాంతంలోని 5, 6 అంగన్వాడి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.కేంద్రాల్లో అందుతున్న సేవలను పరిశీలిస్తూ, లబ్ధిదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి, ఆరోగ్య భోజనాల మెను, ప్రణాళికలు, పాఠశాల, పల్లె గ్రామాల్లో అంగన్వాడి సేవల పరిధి మరియు మెరుగైన వసతులు కోసం వారికి అవసరమయ్యే సూచనలు అడిగి తెలుసుకున్నారు.
తనిఖీ అనంతరం బీబీనగర్ మల్టీ డే కేర్ సెంటర్ను సందర్శించి, వయో వృద్ధులు, చిన్నారులు సంతోషంగా డే కేర్ సెంటర్ల సేవలను పొందే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శ్రీ నరసింహ రావు, సీడిపిఓ శైలజ, అంగన్వాడి టీచర్లు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి