Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:25 PM

మహిళా న్యాయవాదిపై హత్య… న్యాయవ్యవస్థను కుదిపేసిన అమానుషం!

మహిళా న్యాయవాదిపై హత్య… న్యాయవ్యవస్థను కుదిపేసిన అమానుషం!

మహిళా న్యాయవాదిపై హత్య… న్యాయవ్యవస్థను కుదిపేసిన అమానుషం!
February 05, 2026 06:59 PM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్వప్న హత్యకు నిరసనగా కోర్టు ముందర మహిళా న్యాయవాదుల గర్జన

మహిళా న్యాయవాది స్వప్నను అమానుషంగా హత్య చేసిన ఘటనకు నిరసనగా సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట తీవ్ర ఆందోళన చేపట్టారు. నిన్న చేవెళ్ల బార్ అసోసియేషన్‌కు చెందిన మహిళా న్యాయవాది స్వప్నపై జరిగిన హత్య న్యాయవ్యవస్థను కలచివేసిందని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుంటూరు మధు, సీనియర్ న్యాయవాదులు వసంత సత్యనారాయణ పిల్లే, మహిళా న్యాయవాది సరిత మాట్లాడుతూ స్వప్న హత్యను తీవ్రంగా ఖండించారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించిన పరిరక్షణ చట్టాన్ని తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

న్యాయం కోసం కక్షిదారుల తరఫున పోరాడే న్యాయవాదులకు సరైన రక్షణ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా న్యాయవాదులు రోజువారీ విధుల్లో భయాందోళనల మధ్య పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే న్యాయవాదుల పరిరక్షణకు చట్టాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు గాదె రమాదేవి, తల్లమల్ల హసేన్, బొమ్మగాని శ్రీను, దాసరి వెంకటేశ్వరరావు, కోకా రంజిత్ కుమార్, పోలబోయిన నరసయ్య, కట్ట సుధాకర్, మీసాల శ్రీనివాస్, బచ్చలకూరి గోపి, చంద్రకాంత్, సందీప్‌తో పాటు పలువురు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News