Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:57 PM

మహిళా న్యాయవాదిపై హత్య… న్యాయవ్యవస్థను కుదిపేసిన అమానుషం!

మహిళా న్యాయవాదిపై హత్య… న్యాయవ్యవస్థను కుదిపేసిన అమానుషం!

మహిళా న్యాయవాదిపై హత్య… న్యాయవ్యవస్థను కుదిపేసిన అమానుషం!
February 05, 2026 06:59 PM 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్వప్న హత్యకు నిరసనగా కోర్టు ముందర మహిళా న్యాయవాదుల గర్జన

మహిళా న్యాయవాది స్వప్నను అమానుషంగా హత్య చేసిన ఘటనకు నిరసనగా సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట తీవ్ర ఆందోళన చేపట్టారు. నిన్న చేవెళ్ల బార్ అసోసియేషన్‌కు చెందిన మహిళా న్యాయవాది స్వప్నపై జరిగిన హత్య న్యాయవ్యవస్థను కలచివేసిందని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుంటూరు మధు, సీనియర్ న్యాయవాదులు వసంత సత్యనారాయణ పిల్లే, మహిళా న్యాయవాది సరిత మాట్లాడుతూ స్వప్న హత్యను తీవ్రంగా ఖండించారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించిన పరిరక్షణ చట్టాన్ని తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

న్యాయం కోసం కక్షిదారుల తరఫున పోరాడే న్యాయవాదులకు సరైన రక్షణ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా న్యాయవాదులు రోజువారీ విధుల్లో భయాందోళనల మధ్య పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే న్యాయవాదుల పరిరక్షణకు చట్టాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు గాదె రమాదేవి, తల్లమల్ల హసేన్, బొమ్మగాని శ్రీను, దాసరి వెంకటేశ్వరరావు, కోకా రంజిత్ కుమార్, పోలబోయిన నరసయ్య, కట్ట సుధాకర్, మీసాల శ్రీనివాస్, బచ్చలకూరి గోపి, చంద్రకాంత్, సందీప్‌తో పాటు పలువురు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News