మహిళా కళకు వేదిక – శివనేనిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో ముగ్గుల సంబరాలు
మహిళా కళకు వేదిక – శివనేనిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో ముగ్గుల సంబరాలు
Editor Desk
శివనేనిగూడెంలో సంక్రాంతి ముగ్గుల సంబరాలు
స్థానికం ప్రధాన ప్రతినిధి
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిట్యాల మున్సిపాలిటీ ఫస్ట్ వార్డు శివనేనిగూడెంలో బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు రుద్రవరం లింగస్వామి గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ ముగ్గుల పోటీల్లో 100 మంది మహిళలు పాల్గొని రకరకాల కళాత్మకమైన, సంప్రదాయ ముగ్గులతో గ్రామాన్ని రంగులమయం చేశారు. మహిళల సృజనాత్మకతకు ఈ కార్యక్రమం ప్రత్యేక వేదికగా నిలిచింది.
పోటీల్లో ఉత్తమంగా వేసిన ముగ్గులను ఎంపిక చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ బహుమతులు అందజేయడంలో సహకరించిన మిత్రులు కన్నబోయిన శ్రీధర్ గారికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముగ్గుల ఎంపిక, బహుమతి ప్రదాన కార్యక్రమంలో పుడమి సాహితీ వేదిక అధ్యక్షులు, ఉపాధ్యాయులు చిలుముల బాల్ రెడ్డి, రుద్రవరం కృష్ణయ్య (లెక్చరర్), గాదె లింగస్వామి (లెక్చరర్), రుద్రవరం స్వామి టీచర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చొప్పరి మల్లయ్య, రుద్రవరం దశరథ, రుద్రవరం సునీల్, రుద్రవరం కుమార్, రుద్రవరం నరేష్, రుద్రవరం సహదేవలు, ఏడ్ల మహాలింగం, చిలుముల వెంకట్ రెడ్డి, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, నూతి కాశీరం, రుద్రవరం గణేశా, రుద్రవరం మధు, రుద్రవరం వంశీ, రుద్రవరం శ్రీకాంత్, ఎటలె నవీన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి