Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:39 AM

మహిళా కళకు వేదిక – శివనేనిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో ముగ్గుల సంబరాలు

మహిళా కళకు వేదిక – శివనేనిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో ముగ్గుల సంబరాలు

మహిళా కళకు వేదిక – శివనేనిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో ముగ్గుల సంబరాలు
January 16, 2026 02:27 PM 121 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శివనేనిగూడెంలో సంక్రాంతి ముగ్గుల సంబరాలు

స్థానికం ప్రధాన ప్రతినిధి

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిట్యాల మున్సిపాలిటీ ఫస్ట్ వార్డు శివనేనిగూడెంలో బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు రుద్రవరం లింగస్వామి గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ ముగ్గుల పోటీల్లో 100 మంది మహిళలు పాల్గొని రకరకాల కళాత్మకమైన, సంప్రదాయ ముగ్గులతో గ్రామాన్ని రంగులమయం చేశారు. మహిళల సృజనాత్మకతకు ఈ కార్యక్రమం ప్రత్యేక వేదికగా నిలిచింది.

పోటీల్లో ఉత్తమంగా వేసిన ముగ్గులను ఎంపిక చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ బహుమతులు అందజేయడంలో సహకరించిన మిత్రులు కన్నబోయిన శ్రీధర్ గారికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముగ్గుల ఎంపిక, బహుమతి ప్రదాన కార్యక్రమంలో పుడమి సాహితీ వేదిక అధ్యక్షులు, ఉపాధ్యాయులు చిలుముల బాల్ రెడ్డి, రుద్రవరం కృష్ణయ్య (లెక్చరర్), గాదె లింగస్వామి (లెక్చరర్), రుద్రవరం స్వామి టీచర్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చొప్పరి మల్లయ్య, రుద్రవరం దశరథ, రుద్రవరం సునీల్, రుద్రవరం కుమార్, రుద్రవరం నరేష్, రుద్రవరం సహదేవలు, ఏడ్ల మహాలింగం, చిలుముల వెంకట్ రెడ్డి, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, నూతి కాశీరం, రుద్రవరం గణేశా, రుద్రవరం మధు, రుద్రవరం వంశీ, రుద్రవరం శ్రీకాంత్, ఎటలె నవీన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News