మహాశివరాత్రి సందర్భంగా చెరువుగట్టు దేవస్థానంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక పూజలు
మహాశివరాత్రి సందర్భంగా చెరువుగట్టు దేవస్థానంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక పూజలు
Komidala Mahender reddy
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నార్కెట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అర్చకులు వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానంలో భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి