Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:42 AM

మహాలక్ష్మి ధర్మశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

మహాలక్ష్మి ధర్మశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

మహాలక్ష్మి ధర్మశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
January 23, 2026 07:01 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

శ్రీ లక్ష్మి గణపతి హోమంలో

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ధర్మశాలలో ధర్మశాల కమిటీ చైర్మన్ మంచి కంటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హోమములో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు, ధర్మశాల కమిటీ సభ్యులు, మహిళలు. వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. ధర్మ శాల చైర్మన్ ఎమ్మెల్యేను పట్టు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 50 సంవత్సరాల క్రితం ఎంతో వైభవంగా వీరాజిల్లిన ధర్మశాలకు పూర్వవైభవాన్ని తీసుకొస్తామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ వ్యాపార, ఇతర పనుల నిమిత్తం భువనగిరి కేంద్రానికి వచ్చే వ్యాపారులకు ప్రజలకు ఆశ్రయం కల్పించిన ధర్మశాల గత పాలకులు పట్టించుకోకపోవడంతో క్షీణ దశకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ధర్మశాల భవనాన్ని, మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మిస్తామన్నారు. ధర్మశాల కమిటీ ఆ దిశగా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవాలన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు నోటుబుక్సు పెన్నులు పంపిణీ చేశారు. వసంత పంచమి వేడుకలకు విచ్చేసిన,గ్రంథాలయ జిల్లా చైర్మన్ ఆఫీస్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోతన ప్రమోద్ కుమార్, టిపిసిసి మాజీ నెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కూర వెంకటేష్, మాజీ అధ్యక్షులు కుక్కదూగు సోమయ్య, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సేవాదళ్ రాష్ట్ర నాయకులు పిట్టల బాలరాజు, వర్తకులకు ధర్మశాల కమిటీ శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News