Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:44 PM

మహేశ్వరంలో బిఆర్ఎస్‌కు భారీ షాక్

మహేశ్వరంలో బిఆర్ఎస్‌కు భారీ షాక్

మహేశ్వరంలో బిఆర్ఎస్‌కు భారీ షాక్
January 08, 2026 07:06 PM 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామకృష్ణాపురం డివిజన్‌లో కాంగ్రెస్‌లోకి చేరికలు… మహిళా నేత అనురాధ పార్టీలో విలీనం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్‌లో బిఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బిఆర్ఎస్ పార్టీ మహిళా జనరల్ సెక్రెటరీ అనురాధ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేగింది. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టిపిసిసి సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి సమక్షంలో, చిలుక ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆమెకు స్వాగతం పలికారు.

అనంతరం దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పారదర్శక, పేదల పక్షపాతి పాలనకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతుండటంతో ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రామకృష్ణాపురం డివిజన్‌లో బిఆర్ఎస్, బీజేపీ నేతలు వరుసగా కాంగ్రెస్‌లో చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూన్న గణేష్, ఏఎంసీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, ఆలయ కమిటీ చైర్మన్లు సురేష్, తలాటి రమేష్, యువజన కాంగ్రెస్ నాయకులు ముప్పిడి లింగస్వామి గౌడ్, జ్ఞానేశ్వర్ యాదవ్, పెద్దవూర సైదులు, భూపాల్ రెడ్డి, సంతోష్, రేణుక, స్వరూప, మాధవి, కవిత, ప్రమీల, రమాదేవి, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News