స్థానికం ప్రధాన ప్రతినిధి
ఆదోని మండల పరిధిలోని మదిరే గ్రామంలోని ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పదో తరగతి విద్యార్థులకు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మదిరే భాస్కర్ రెడ్డి విద్యార్థులకు వాటర్ బాటిళ్లను అందజేశారు.పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సమాజం మొత్తం తోడ్పడాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ సాయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ వాటర్ బాటిళ్లను మదిరే బెస్త శ్రీనివాసులు అందించడం ఆశించదగ్గ విషయమని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి