Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:48 PM

మదర్ డైరీ చైర్మన్‌గా మందడి ప్రభాకర్ రెడ్డి — పాల సహకార రంగంలో కొత్త అధ్యాయం

మదర్ డైరీ చైర్మన్‌గా మందడి ప్రభాకర్ రెడ్డి — పాల సహకార రంగంలో కొత్త అధ్యాయం

మదర్ డైరీ చైర్మన్‌గా మందడి ప్రభాకర్ రెడ్డి — పాల సహకార రంగంలో కొత్త అధ్యాయం
January 08, 2026 08:17 PM 425 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మదర్ డైరీ చైర్మన్‌గా మందడి ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

పాల ఉత్పత్తి సహకార సంఘంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మదర్ డైరీ చైర్మన్‌గా మందడి ప్రభాకర్ రెడ్డిని సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంపూర్ణ సమ్మతితో జరిగిన ఈ ఎన్నిక పాల రంగంలో కొత్త ఆశలను రేకెత్తించింది.సంఘ కార్యకలాపాలపై లోతైన అవగాహన, సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిగా ప్రభాకర్ రెడ్డి పేరు ముందుండటంతో ఎన్నిక ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ముగిసింది. పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, సంఘ బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల ఉత్పత్తి సహకార సంఘ సభ్యులు కోట్ల జలేందర్ రెడ్డి, కందాల అలివేలు, గూడూరు శ్రీధర్ రెడ్డి, కస్తూరి పాండు, గొల్లెపల్లి రాంరెడ్డి, కల్లెపల్లి శ్రీశైలం, పుష్పాల నర్సింహులు, మండలి జంగయ్య, అగ్రాల నర్సింహ్మా రెడ్డి, బత్తుల నరేందర్ రెడ్డి, కర్నాటి జయశ్రీ, రచ్చ లక్ష్మినర్సింహ్మా రెడ్డి, సందిల భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొని నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల సలహా–సూచనల మేరకు పాల రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మదర్ డైరీ ద్వారా పాల ఉత్పత్తిదారులకు మెరుగైన ధరలు, నాణ్యమైన సేవలు అందిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News