మదర్ డైరీ చైర్మన్గా మందడి ప్రభాకర్ రెడ్డి — పాల సహకార రంగంలో కొత్త అధ్యాయం
మదర్ డైరీ చైర్మన్గా మందడి ప్రభాకర్ రెడ్డి — పాల సహకార రంగంలో కొత్త అధ్యాయం
Editor Desk
మదర్ డైరీ చైర్మన్గా మందడి ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
పాల ఉత్పత్తి సహకార సంఘంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మదర్ డైరీ చైర్మన్గా మందడి ప్రభాకర్ రెడ్డిని సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంపూర్ణ సమ్మతితో జరిగిన ఈ ఎన్నిక పాల రంగంలో కొత్త ఆశలను రేకెత్తించింది.సంఘ కార్యకలాపాలపై లోతైన అవగాహన, సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిగా ప్రభాకర్ రెడ్డి పేరు ముందుండటంతో ఎన్నిక ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ముగిసింది. పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, సంఘ బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల ఉత్పత్తి సహకార సంఘ సభ్యులు కోట్ల జలేందర్ రెడ్డి, కందాల అలివేలు, గూడూరు శ్రీధర్ రెడ్డి, కస్తూరి పాండు, గొల్లెపల్లి రాంరెడ్డి, కల్లెపల్లి శ్రీశైలం, పుష్పాల నర్సింహులు, మండలి జంగయ్య, అగ్రాల నర్సింహ్మా రెడ్డి, బత్తుల నరేందర్ రెడ్డి, కర్నాటి జయశ్రీ, రచ్చ లక్ష్మినర్సింహ్మా రెడ్డి, సందిల భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొని నూతన చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల సలహా–సూచనల మేరకు పాల రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మదర్ డైరీ ద్వారా పాల ఉత్పత్తిదారులకు మెరుగైన ధరలు, నాణ్యమైన సేవలు అందిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి