తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు సి. జోసెఫ్ విజయ్ తన వినూత్న పని తీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే క్రమశిక్షణ, సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మే 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ప్రతిరోజూ నిర్ణీత సమయానికి పావుగంట ముందుగానే చెన్నైలోని సెయింట్ జార్జ్ కోటలో ఉన్న సచివాలయానికి చేరుకుంటున్నారు. ఇంటి నుంచే స్వయంగా లంచ్ బాక్స్ తీసుకువస్తూ సాదాసీదా జీవనశైలికి ప్రాధాన్యం ఇస్తున్నారు. భోజన విరామ సమయంలో కూడా తన ఛాంబర్కే పరిమితమై, భోజనం ముగిసిన వెంటనే తిరిగి అధికారిక పనుల్లో నిమగ్నమవుతున్నారు.
సీఎంగా విజయ్ అనుసరిస్తున్న ఈ నిరాడంబర విధానం అధికారులతో పాటు ప్రజల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి