లింగోజిగూడెం గ్రామంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చింది. నమ్మదగిన సమాచారం మేరకు సాయంత్రం సమయంలో ఎస్ఐ కే. ఉపేందర్ రెడ్డి సిబ్బందితో కలిసి లింగోజిగూడెం గ్రామంలో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వలందాస్ స్వామి (65) s/o ముత్యాలు అనే వ్యక్తి షాపులో తనిఖీ చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అక్కడి నుంచి Sumo 180 మిల్లీలీటర్ల 12 బాటిల్స్, IB 180 మిల్లీలీటర్ల 3 బాటిల్స్, OC 180 మిల్లీలీటర్ల 3 బాటిల్స్ ను పట్టుకున్నారు.
అనంతరం వలందాస్ స్వామిని, స్వాధీనం చేసిన మద్యం బాటిల్స్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీఐ జి. మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి