కనగల్ మండలం కురంపల్లి గ్రామంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వల్కీ క్రాంతికుమార్ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
గ్రామంలోని 5వ వార్డు ఎస్సీ మాల కాలనీలో మురుగు కాలువల నీరు చర్చి సమీపంలో నిల్వ ఉండటంతో పెద్ద మడుగుగా మారిందని తెలిపారు. గత రెండేళ్లుగా మురికి నీటి దుర్వాసన, దోమల సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ అధికారులకు, సర్పంచ్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. వెంటనే మురుగు కాలువలను శుభ్రం చేసి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవోను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి