Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:42 PM

కుమారుడికి విషమిచ్చి హతమార్చి.. తానూ ఆత్మహత్య

కుమారుడికి విషమిచ్చి హతమార్చి.. తానూ ఆత్మహత్య

కుమారుడికి విషమిచ్చి హతమార్చి.. తానూ ఆత్మహత్య
January 11, 2026 07:24 AM 390 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మీర్పేటలో కలకలం రేపిన కుటుంబ విషాదం

భర్త వేధింపులే కారణమంటున్న మృతురాలి బంధువులు

బాలాపూర్, స్థానికం ప్రధాన ప్రతినిధి:

రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ మహిళ తన 11 నెలల కుమారుడికి విషమిచ్చి హతమార్చి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మృతురాలి తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

మీర్పేట ఇన్‌స్పెక్టర్ శంకర్‌కుమార్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ యశ్వంత్‌రెడ్డికి అదే ప్రాంతానికి చెందిన సుస్మిత (27)తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహానంతరం దంపతులు హస్తినాపురం జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి అశ్వంత్ నందన్‌రెడ్డి (11 నెలలు) అనే కుమారుడు ఉన్నాడు.

బాలుడి తొలి పుట్టినరోజు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితమే కుటుంబ సభ్యులు షాపింగ్ కూడా చేశారు. గురువారం ఉదయం యశ్వంత్‌రెడ్డి ఆఫీసుకు వెళ్లగా, మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో బెడ్‌రూమ్‌లో సుస్మిత ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. అదే గదిలో చిన్నారి అశ్వంత్ నందన్‌రెడ్డి మృతదేహం కనిపించింది.ఇక ఘటన సమయంలో ఇంట్లో ఉన్న సుస్మిత తల్లి లలిత (50) అపస్మారక స్థితిలో పడిపోయి ఉండగా, ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రాథమిక విచారణలో సుస్మిత ముందుగా కుమారుడికి విషమిచ్చి అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతురాలి తల్లి అపస్మారక స్థితికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు.

ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. భర్త యశ్వంత్‌రెడ్డి సుస్మితను తీవ్రంగా వేధించేవాడని, బయటకు వెళ్లనీయకుండా,ఎవరితోనూమాట్లాడనివ్వకుండా ఆంక్షలు విధించేవాడని ఆరోపించారు. భర్త వేధింపుల కారణంగానే సుస్మిత ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె పెదనాన్న సంజీవరెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ శంకర్‌కుమార్ నాయక్ తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News