క్రీడల్లో రాణించి గ్రామానికి కీర్తి తేవాలి: బండ మధుకర్ రెడ్డి
క్రీడల్లో రాణించి గ్రామానికి కీర్తి తేవాలి: బండ మధుకర్ రెడ్డి
Editor Desk
మునిపంపులలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం
స్థానికం ప్రధాన ప్రతినిధి
మునిపంపుల గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏలూరి కుమారస్వామి జ్ఞాపకార్థం నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ను బీజేపీ మండల అధ్యక్షులు బండ మధుకర్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత అన్ని రంగాల్లో ముందుండి, ముఖ్యంగా క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించి గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం ద్వారా పార్లమెంట్ స్థాయిలో క్రీడా మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఖోఖో వంటి పోటీల్లో యువత భాగస్వాములై నియోజకవర్గ, పార్లమెంట్, జాతీయ స్థాయిల వరకు ఎదగాలని, ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వనం అంజయ్య, మునిపంపుల మాజీ సర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకులు కట్ట యాదయ్య, సభాధ్యక్షులు సుధీర్, ప్రభాకర్ చారి, రామ్ లక్ష్మయ్య, శ్యాంసుందర్, సురుగు జంగీర్, సద్దల వెంకట్, రామలక్ష్మయ్య, మిర్యాల శ్రీధర్, చింత రమేష్, రావుల నవీన్, ఏలూరు సాయి, బంటి భాను రాజశేఖర్, సాయి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి