యాదాద్రి భువనగిరి జిల్లా,
చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికలలో 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా పాక చిరంజీవి విజయం సాధించారు. ఈ సందర్భంగా పాక చిరంజీవి మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఓటర్లకు, అనునిత్యం అహర్నిశలు తన గెలుపు కోసం శ్రమించి కృషి చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో తమ దృష్టి అంతా 12వ వార్డు అభివృద్ధిపై కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ విజయం మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు.12వ వార్డును మరింత అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి