Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:20 AM

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. వీరేశం

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. వీరేశం

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. వీరేశం
January 24, 2026 06:03 AM 128 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

స్థానికం – ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నదన్నారు. మహిళలకు నైపుణ్య శిక్షణ, సమావేశాల నిర్వహణ కోసం ఇందిరా మహిళా శక్తి భవనాలను మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ భవనాల ద్వారా మహిళా సంఘాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.

త్వరలో బస్వాపూర్ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ మండలంలో ఇరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. అలాగే నూతన తహశీల్దార్ కార్యాలయ నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లాల్ బహుదూర్, వ్యవసాయ అధికారి ఎజాజ్ అలీ ఖాన్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు మారపల్లి మల్లారెడ్డి, కంచి మధుసూదన్, చిల్ల మధురవేణి సురేష్, పైళ్ళ చందన వెంకట్ రెడ్డి, వెలగపూరి జనని, కోళ్ల రామకృష్ణ, చల్ల వరలక్ష్మి, బాచుప్పల మాధవి, ఈడెం రాధశ్రీనివాస్, పట్టణ ఉపసర్పంచ్ మోటె రమేష్, నాయకులు గంగుల రాజిరెడ్డి, జినుకల ప్రభాకర్, మేడి రవిచంద్ర, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, పూస బాలనర్సయ్య, ఎండి జమీరుద్దీన్, వనం చంద్రశేఖర్, ఎండీ అక్రమ్, ఎర్ర శేఖర్ గౌడ్, మోటే మహేష్, గంపల రామచంద్రారెడ్డి, కొమ్ము రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News