Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 10:04 AM

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. వీరేశం

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. వీరేశం

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. వీరేశం
January 24, 2026 06:03 AM 141 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

స్థానికం – ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నదన్నారు. మహిళలకు నైపుణ్య శిక్షణ, సమావేశాల నిర్వహణ కోసం ఇందిరా మహిళా శక్తి భవనాలను మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ భవనాల ద్వారా మహిళా సంఘాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.

త్వరలో బస్వాపూర్ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ మండలంలో ఇరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. అలాగే నూతన తహశీల్దార్ కార్యాలయ నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లాల్ బహుదూర్, వ్యవసాయ అధికారి ఎజాజ్ అలీ ఖాన్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు మారపల్లి మల్లారెడ్డి, కంచి మధుసూదన్, చిల్ల మధురవేణి సురేష్, పైళ్ళ చందన వెంకట్ రెడ్డి, వెలగపూరి జనని, కోళ్ల రామకృష్ణ, చల్ల వరలక్ష్మి, బాచుప్పల మాధవి, ఈడెం రాధశ్రీనివాస్, పట్టణ ఉపసర్పంచ్ మోటె రమేష్, నాయకులు గంగుల రాజిరెడ్డి, జినుకల ప్రభాకర్, మేడి రవిచంద్ర, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, పూస బాలనర్సయ్య, ఎండి జమీరుద్దీన్, వనం చంద్రశేఖర్, ఎండీ అక్రమ్, ఎర్ర శేఖర్ గౌడ్, మోటే మహేష్, గంపల రామచంద్రారెడ్డి, కొమ్ము రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News