కోతులారం కుమ్మర ముద్దుబిడ్డ లింగస్వామి కి అరుదైన సత్కారం
కోతులారం కుమ్మర ముద్దుబిడ్డ లింగస్వామి కి అరుదైన సత్కారం
స్థానికం బృందం
వివేకానంద ఐకాన్ పురస్కారంతో రాపోలు లింగస్వామికి ఘన గౌరవం
జర్నలిజం–సమాచార హక్కు సేవలతో ప్రజల గళంగా గుర్తింపు
అవార్డుల వరుసలో మరో మైలురాయి
స్థానికం ప్రధాన ప్రతినిధి
స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతులను పురస్కరించుకుని తెలుగు వెలుగు సాహితి వేదిక ఆధ్వర్యంలో హనుమకొండ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన జాతీయ పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిజం, సమాచార హక్కు, సామాజిక సేవల రంగాల్లో విశిష్ట సేవలు అందించిన రాపోలు లింగస్వామికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ పురస్కారం, ప్రశంస పత్రంతో ఘనంగా సన్మానించారు.
జర్నలిస్టుగా, సమాచార హక్కు కార్యకర్తగా ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువచ్చిన రాపోలు లింగస్వామి సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని వక్తలు ప్రశంసించారు. నిజాయితీ, ధైర్యం, ప్రజాపక్షపాతంతో ఆయన చేసిన కృషి ప్రజల మన్ననలను పొందుతోందన్నారు.
ఇదివరకే ఆయనకు క్రాంతి జ్యోతి ఎక్స్లెన్స్ పురస్కారం, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు, ఉత్తమ జర్నలిస్టు అవార్డు వంటి పలు పురస్కారాలు లభించాయి. అలాగే సమాచార హక్కు ఉద్యమంలో చేసిన విశిష్ట కృషికి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ప్రత్యేక స్థానం దక్కడం మరో ఘనతగా నిలిచింది.
సామాన్య కుటుంబ నేపథ్యంతో ఎదిగి, ప్రజా సమస్యలపై పోరాడుతూ సమాజానికి వాణిగా నిలిచిన రాపోలు లింగస్వామి, సమాచార హక్కు చట్టాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాల ద్వారా సామాజిక సేవల్లోనూ తన సేవాభావాన్ని చాటుకున్నారు.
గ్రామస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిల వరకు వరుసగా అవార్డులు అందుకుంటూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న రాపోలు లింగస్వామిని పలువురు అభినందిస్తున్నారు. జర్నలిజం–సమాచార హక్కు–సామాజిక సేవల సమన్వయంతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన ఆయన, నేటి యువతకు ప్రేరణగా నిలుస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి