కూరెళ్ల గ్రంథాలయంలో డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు ‘అమ్మానాన్నల జీవన సౌపాల్య పురస్కారం’
కూరెళ్ల గ్రంథాలయంలో డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు ‘అమ్మానాన్నల జీవన సౌపాల్య పురస్కారం’
Editor Desk
దాసోజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
వెల్లంకి, స్థానికం ప్రధాన ప్రతినిధి
విద్య, సాహిత్య రంగాలకు చిరస్థాయిగా సేవలందిస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు దాసోజు ఫౌండేషన్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. మంగళవారం వెల్లంకి గ్రామంలోని కూరెళ్ల గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దాసోజు వజ్రమ్మ, విశ్వనాథ చారి గార్ల జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన **‘అమ్మానాన్నల జీవన సౌపాల్య పురస్కారం’**ను ఆయనకు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రశంసాపత్రంతో పాటు రూ.10,116 నగదు పురస్కారాన్ని ఫౌండేషన్ ప్రతినిధులు సమర్పించారు. దాసోజు ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ దాసోజు పద్మావతి మదనాచారి, వ్యవస్థాపక అధ్యక్షులు దాసోజు గోవర్ధనాచారి (ప్రముఖ న్యాయవాది, హైదరాబాద్), భాస్కరాచారి, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ అపర్ణ (హైదరాబాద్), డాక్టర్ విశ్వపతి తదితరులు ఆచార్య కూరెళ్ల గ్రంథాలయానికి చేరుకొని డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను శాలువాతో సత్కరించారు.
వక్తలు మాట్లాడుతూ, డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య చేసిన సేవలు కేవలం విద్యావ్యవస్థకే పరిమితం కాకుండా సమాజ నిర్మాణానికి దోహదపడినవని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాల ఏర్పాటు ద్వారా పఠన సంస్కృతిని పెంపొందించడంలో ఆయన చేసిన కృషి అనేక తరాలకు మార్గదర్శకమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో కూరెళ్ల ఫౌండేషన్ అధ్యక్షులు బోగోజు గోవర్ధనాచారి, కార్యదర్శి కె. నర్మద, తపతి, గ్రంథపాలకుడు తాటిపాముల స్వామి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి