కూరెళ్ళ జ్యోతి లింగస్వామి గెలిపే లక్ష్యం భాగ్యనగర్ కాలనీ బిఆర్ఎస్ సమావేశం
కూరెళ్ళ జ్యోతి లింగస్వామి గెలిపే లక్ష్యం భాగ్యనగర్ కాలనీ బిఆర్ఎస్ సమావేశం
Komidala Mahender reddy
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూరెళ్ళ జ్యోతి లింగస్వామికి మద్దతుగా భాగ్యనగర్ కాలనీ వాసులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ పార్టీ పోషించిన పాత్రను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలైన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ మేలు చేశాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంకొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలనిపిలుపునిచ్చారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలంటే స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం అవసరమని పేర్కొన్నారు. కూరెళ్ళ జ్యోతి లింగస్వామి విజయం ద్వారా వార్డు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి