Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎకో బజార్‌తో పర్యావరణ చైతన్యం. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు 14 ఏళ్లుగా ఆడపిల్ల పుడితే రూ.1 కూడా తీసుకోకుండా.. పూణే డాక్టర్ గణేష్ రాఖ్ సేవా గాథ! శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 04:19 PM

కోదాడ పట్టణంలో పోలీసు అధ్వర్యంలో హెల్మెట్ వినియోగం పై అవగాహన ర్యాలీ..

కోదాడ పట్టణంలో పోలీసు అధ్వర్యంలో హెల్మెట్ వినియోగం పై అవగాహన ర్యాలీ..

కోదాడ పట్టణంలో పోలీసు అధ్వర్యంలో హెల్మెట్ వినియోగం పై అవగాహన ర్యాలీ..
March 28, 2026 02:18 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

హెల్మెట్ ధరించి ప్రమాదాలలో రక్షణ పొందండి.. కోదాడ డివిజనల్ డీఎస్సీ శ్రీనివాసరెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యచరణ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కోదాడ పట్టణంలో కోదాడ పట్టణ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ వినియోగం పై అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగినది. కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని కోదాడ సబ్ డివిజనల్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్ తో కలిసి ప్రారంభించారు. ర్యాలీ ఖమ్మం క్రాస్ రోడ్డు నుండి రంగా థియేటర్ క్రాస్ రోడ్డు వరకు నిర్వహించి స్థానిక ప్రజలకు, వాహనదారులకు, స్థానిక వ్యాపారులకు హెల్మెట్ వినియోగం పట్ల అవగాహన కల్పించారు. ర్యాలీ నందు పట్టణ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, స్థానిక పౌరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోదాడ డివిజన్ డీఎస్సీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల అనుకోని రోడ్డు ప్రమాదాలలో ప్రాణాపాయం నుండి రక్షణ పొందవచ్చునని సూచించారు. ద్విచక్ర వాహనంపై కూర్చునే వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత హెల్మెట్ వినియోగం అవగాహన ర్యాలీని నిర్వహించామని తెలిపారు. ప్రతి పౌరుడు, ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాల పట్ల, సురక్షిత ప్రయాణం పట్ల, రహదారుల వినియోగం పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రజలకు రోడ్డు నియమాల పట్ల, జాగ్రత్తల పట్ల విస్తృతంగా అవగాహన కల్పిస్తుందని ప్రజలు వాహనదారులు గమనించాలని కోరారు. వాహనదారులు వాహనాలు నిదానంగా నడపాలని అన్నారు.ఈ ర్యాలీలో పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, పట్టణ ఎస్ఐ సుధీర్, పోలీసు సిబ్బంది స్థానిక పౌరులు పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News